పుట:సకలనీతికథానిధానము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

సకలనీతికథానిధానము


క.

నీసాహసమున కలరితి
యేసిద్ధుఁలనైన వేడు మిచ్చెద ననినన్
గ్రాసంబు మాను పూజల్
చేసినమానవుని విడువు? శుద్ధచరిత్రా.

240


వ.

అని మానుషాశనం బెన్నడు చేయకుమని యాపూజారి విడిపించె నని మఱియు నారదుం డిట్లనియె.

241


క.

పాయక ప్రాణము కెల్ల న
పాయము గావించు క్రూరపార్థివుహింసా
ప్రాయంబు మాన్పుమంత్రికి
నాయింద్రపదంబు జేరు ననిరి మహాత్ముల్.

242


వ.

అని యుపన్యసించి విక్రమాదిత్యుని విచిత్రం బొక్కటి గలదు విను మని యిట్లనియె.

243


క.

అపరాధి గానివారిని
నెప మిడి దండించెనేని నిజసుతునైనన్
రిపునిగతి దునుమజూచుట
నృపతులకును దండనీతి నిల్పుటగాదె.

244


వ.

అట్లు గావున.

245


క.

మునిమాట్కి విక్రమార్కుఁడు
చని దేశములెల్ల జూచుసమయమునందున్
వననిధితటమున నొకపురి
కనుగొని వసియించె నికటగహనమునందున్.

246


సీ.

ఆపురవర మేలునధిపతి సువిచారు
        డనుమహీపతి కూర్మితనయుఁ డొకఁడు
జయసేనుఁడనువాఁడు హయయానుఁడై వేఁట
        యరిగి సరితీర్థ మాడదలఁచి