పుట:సకలనీతికథానిధానము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

సకలనీతికథానిధానము


దక్రమ మంటగాఁ దెరువుదప్ప సమిత్తులు గొంచువచ్చు వే
దక్రమశాలియంబువులు ధాత్రిఫలంబులు నీయ దృప్తుఁడై.

146


చ.

పురము పథంబు చూప జని భూసురకోటికి దాన మిచ్చుచో
హరవరదత్తుఁ డాద్విజసహాయత రాజగృహంబులోనికిన్
వెరవున నేఁగి యర్కపృథ్వీపతి పుత్రుని రత్నహాటకా
భరణుని బట్టికొంచు జని బాలకుని న్వెస దాఁచి యంతటన్.

147


క.

తనయుఁడు దొడిగినమణిమయ
కనకాభరణంబు లమ్మఁగాంచి తలారుల్
తనయద్రోహుం డీతం
డని విప్రునిఁ గట్టి దుఃఖియగునృపు నెదురన్.

148


క.

నిలుపుటయు విక్రమార్కుఁడు
తల.. .. ..విప్రు గాఁచి తను గారడవిన్
మెలఁగ గని తెరువు చూపుట
తలఁచి ద్విజున్ విడువుమనియెఁ దలవరితోడన్.

149


క.

ప్రాణంబుఁ గల్గెనేనియు
(రాణులు) పుత్రులు ధనంబు రాజ్యము గలుగున్
ప్రాణమె బంధువు లోక
ప్రాణులకయి గావవలయు బ్రాణానిలముల్.

150


ఆ.

అనుచు విప్రునకును (నధికధనం బిచ్చి)
యనిపె నపుడు విక్రమార్కనృపతి
చిన్నమంతమేలు చేసిన సుజనుఁడు
చెప్పరాని మేలు చేయకున్నె.

151


క.

కృత మెఱుఁగ(కున్న) దైవము
కృతఘ్నునకు నిహము పరము నేలా కలుగున్
కృత మెఱిఁగి పుత్రహరుఁడగు
నతని న్విడిపించె విక్రమార్కుఁడు......

152