పుట:సకలనీతికథానిధానము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27


వ.

అప్పుడు.

153


ఆ.

ధరణిసురుఁడు దాను దాఁచిన నృపపుత్రు
దెచ్చి యిడిన శౌర్యదినకరుండు
బ్రాహ్మణుండ విట్టిపని యేలఁ చేసితి
వనిన నీదుభావ మరయ ననియె.

154


వ.

అని చెప్పి నారదమునీశ్వరుండు క్రమ్మర నిట్లనియె.

155


క.

క్షితినాథునాజ్ఞు యెవ్వం
డతిక్రమింపక చరించు నాతఁడు ధరణీ
(పతిచే) బూజితుఁ డగు నా
గతిదప్పిన నృపతిచేత గష్టత నొందున్.

156


వ.

అది యెట్లనిన.

157


సీ.

రత్నాక ? మందలి రత్నపేటికయను
        పురమున నొకవైశ్యపుంగవుండు
మాధవుఁ డనువాఁడు మాణిక్య మొక్కటి
        గొని తెచ్చి విక్రమార్కునికిఁ జూపి
దీనికి వెల కోటిదీనారతతి యని
        చెప్పి వెండియును విచిత్రమణులు
పదియున్న వింటను పరిజనంబుల బంపు
        కొనివచ్చు ననిన నజ్జనవిభుండు


తే.

సహచరుని బంప నామణిచయము గొనుచు
వచ్చుచో ద్రోవ నొకయేరు వారుచుండ
దాటనేరక యైదురత్నంబు లొక్క
యీతకానికి నిచ్చి వాఁ డేరు దాఁటె.

158


వ.

అద్దూతజనుండు కడమయైదురత్నంబులు దెచ్చి రాజునకు సమర్పించి తావెచ్చపెట్టిన పంచరత్నంబుల విధం బెఱిఁగింప....

159