పుట:సకలనీతికథానిధానము.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

సకలనీతికథానిధానము


క.

కోలఁ గొని దానిఁ గొట్టిన
గాలొక్కటి విఱిగె దానిఁ గని రజకుం డా
నీలాలకఁ దన్నుటయును
లోలాక్షికిఁ గడుపుదిగిన లోహిత మొలికెన్.

162


గీ.

ధరణిసురుఁడువచ్చి ధరణీపతికిఁ జెప్ప
ధావకునిని విప్రతరుణిఁ బిలిచి
వాదు తెఱఁగు దెలిసి వసుధేశుఁ డిట్లని
పలి సభికులెల్లఁ బ్రస్తుతింప.

163


ఉ.

న్యాయము దప్పఁజేసిరి ధరామరపత్నియు ధావకుండు ని
ట్టీయమ వానిగార్దభము హీనపదంబుగఁ జేసె వీఁ డుపా
ధ్యాయునిగర్భము న్విలయతం బొనరించెను గాన యిట్టి ద
న్యాయము గాకయుండ వినుం డందఱు నాదు వివేకవాక్యముల్.

164


క.

నిర్భయుఁడై భూసురసతి
గర్భిణియగుదాఁకఁ జాకి గైకొను ఖరసం
దర్భంబుదాఁక రజకా
విర్భవ వస్త్రములు మోచు విప్రుం డనియెన్.

165


వ.

అని దుర్వివేకనృపాలుండు దీర్చిన న్యాయంబునకు భూసురుండు దేశత్యాగంబు జేసె నేను గురుక్షేత్రంబున కరుగునప్పుడు.

166


సీ.

ఆకురుక్షేత్రేశుఁడగు మలయప్రభు
        తనయుఁ డిందుప్రభుఁడనెడివాఁడు
త్యాగి దుర్భిక్షవిదారితప్రజఁ జూచి
        వరతపంబున హరివరము గాంచి
కల్పవృక్షాకృతి గైకొని వాంఛిత
        ఫలదాతయై ధరాప్రజలఁ బ్రోచె
నతనిని దానరత్నాకరుఁడని జన
        వితతి వినుతింప వినుచు