పుట:సకలనీతికథానిధానము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

165


సీ.

జగతీశురాష్ట్రదేశంబున రవిగుప్తుఁ
        డనువైశ్యుఁ డప్పురియంగణమునఁ
దనతోడిచెలులునుఁ దాను నోములు నోమ
        వచ్చినభవగుప్త వరతనూజు
రత్నమాలికయను రమణిఁ గటాక్షించి
        విరహవేదన బొంది వివశుఁడైన
నతఁడు పెంచిన శుకమలయ నేమిటి కింత
        యని శివాలయమున కపుడె యరిగి


తే.

పూజ చేసిన పత్రిలో బొంచియుండి
శివునకును మ్రొక్క భవగుప్తుజిలుక పలికె
నీతనూభవ రవిగుప్తునికినిఁ బెండ్లి
సేయుమనవుఁడు హరుఁడు వచించె నన్ను.

205


వ.

అని వివాహంబు చేసిన రవిగుప్తరత్నమాలికలు సుఖం బుండునంత నొక్కనాఁడు.

206


క.

రవిగుప్తుఁడు వేఱొకతెను
వివాహమును గాదలంప వెలఁదుక యనియెన్
శివునానతి మజ్జనకుఁడు
వివాహమునుఁ జేసె నొండువిధ మింకేలా.

207


ఆ.

అనిన నతఁడు నవ్వి యస్మచ్ఛుకము డాఁగి
పలికెఁగాని హరుని పలుకుగల్ల
యనిన నరిగి తండ్రి కావార్త నెఱిగింపఁ
గోరి యల్లుచిలుకఁ గొంచుబోయి.

208


వ.

ఈక లూడ్చి వండింప సమకట్టిన నది దైవికంబున నొక్కచోట డాఁగి యీకలు వచ్చి యెగసి యుపవనంబున వ్రాలి యొక్కరాజు జ్యేష్ఠపుత్రుని చేపడి యతనికి హితుండై యుండె నంత.

209