పుట:సకలనీతికథానిధానము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

129


తే.

నామృగాంకయు నటువలె నాచరించి
తలఁగుటయు లేచి యభ్బూమితలవిభుండు
రత్నసుందరిమీఁదను రక్తి గొంత
వదలి యక్కాంతపై నిలువంగ జేసె.

380


వ.

అంత ప్రభాతంబైన సర్వసఖుండైన చారాయణుని రప్పించి రాత్రివృత్తాంతం బెఱంగించిన నతం డిట్లనియె.

381


మాలిని:

లాటనరేశ్వరపుత్రుఁడు గా దది లక్షణభార్యవిశేషలస
త్పాటలగంధి మృగాంకవతీయను పద్మవిలోచన దేహకళా
హాటకరేఖ మనోహరరూప బ్రియంబున బెండిలియాడుము నాఁ
జాటకునిం గొనియాడి తదీయవిచారము చేయుచునున్నతఱిన్.

382


వ.

భాగురాయణుండు కళావతిం బిలిపించి రత్నసుందరికి హితుండునుఁ బోలె మేఖలామానభంగంబునకుం బ్రతీకారంబుగా మృగాంకవర్మను నాడురూవు గాఁబన్ని కేయూరబాహునకుం బెండ్లి జేయుదమని రత్నసుందరికి వినుపింపుమని పంచుటయును.

383


క.

అది పోయి యట్ల చెప్పిన
మది సంతస మంది యిదియ మార్గం బనుచున్
మదవతి మృగాంకరేఖను
విదితముగా బెండ్లి చేసి విభునకు నంతన్.

384


క.

తనయుఁడని మున్ను మీ యొ
ద్దను బెట్టినవాఁడు గన్య తత్కన్యను మీ
జనపతికి నిమ్ము నా కొక
తనయుం డుదయించె నీకుఁ దమ్ముం డగుచున్.

385


క.

అని లేఖఁ ౙదువ నాసతి
విని లజ్జాఖేదదశల విస్మయపడుచున్
జనుని వెఱపింతు తాఁ
................................

386