పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అనువారు నంత నందఱు స్వామి పుష్కరిణికి నీశాన్యభాగం
బునం దొక్కగహ్వరంబు నీక్షించి యయ్యంధకారబిలం
బునం జొచ్చి కిచకిచలాడుచుం బోవుచు నందొకదివ్యజ్యోతి
నీక్షించి తత్సమీపంబున కరుగుచున్న సమయంబున.

233


సీ.

ఆగుహలోదివ్యహాటకనవరత్న
        గోపురప్రాకారకుడ్యతతులు
వజ్రకవాటము ల్వైదూర్యమాణిక్య
        మరకతమౌక్తికమండపములు
ప్రాసాదము ల్చిత్రభవనపంక్తులు మేటి
        పచ్చతోరణములు బాగు మీఱ
హేమరథంబులు సామజాశ్వంబులు
        వివిధవింతలు దగువీథు లొప్ప


తే.

విమలగానంబులును నృత్యవివిధవాద్య
ములును ఘోషింప యువతులు మెలఁగుచుండ
వరచతుర్భుజులును గదాధరులు శంఖ
చక్రపాణులు నచ్చట సంచరింప.

234


తే.

అమరి యప్రాకృతంబై మహాప్రకాశ
మహిమచే నొప్పు నప్పురమధ్యమందుఁ
గాంచనాద్రినిభంబై ప్రకాశయుతము
భానుసంకాశ మైనవిమానమునను.

235


సీ.

నీలాభ్రగాత్రుండు నీరజనేత్రుండు
        నాజానుబాహుండు సచ్యుతుండు
కనకాంబరుండు సత్కంబుకంఠుండు స
        ల్లలితసద్భూషణాలంకృతుండు