పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

తద్దేశవాసులు రాజును వెదకుచు వచ్చుచుండ దారియందు
శంఖణమహారా జగుపడుటం జేసి యాతనికి దండంబులిడి
శత్రునాశనవృత్తాంతం బంతయు నెఱింగింప సంతసించి శ్రీ వేం
కటాద్రీశ్వరుం గొనియాడుచుఁ, గొంతనడికి నవ్వారలకుఁ దాఁ
జనినపుణ్యక్షేత్రమహిమాతిశయాదులు కర్ణామృతంబుగ
నుడివి వారితో నిజదేశం బగుకాంభోజదేశంబున కరిగి
తొల్లింటివలె రాజ్యపాలనంబు సేయుచుండె నిదియునుంగాక
మఱియొకయితిహాసంబు చెప్పెద నాలకింపుఁ డని మునులకు
సూతుండి ట్లనియె.

163


ఆత్మారాముఁ డనువిప్రునిచరిత్రము

సీ.

మధ్యరాష్ట్రమున నాత్మారాముఁ డనెడుస
        ద్బ్రాహ్మణుం డనఘుండు వందితుండు
దేవ భూసురపూజ లేవేళఁ జేయుచు
        విహితధర్మజ్ఞుఁ డై వెలయుచుండు
నతఁడు పిత్రార్జితార్థాదు లించుకయేని
        లేకుండునట్లుగ లేమి గల్గఁ
గా దీనుఁ డై పెక్కుకష్టంబు లొదవుటం
        జేసి పల్విధముల చింతపడుచు


తే.

నిల్లు విడనాడి శ్రీవేంకటేశుఁ డుండు
పర్వతశ్రేష్ఠమున కధోభాగమునను
దనరుచుండెడు కపిలతీర్థంబుచెంతఁ
జేరి స్నానంబు సేసి తత్తీరమునను.

169


క.

కపిలేశుని సన్నిధిఁ దా
నపు డాన్హికనిష్ఠ నుండి యట లేచి మహా