పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యీమహాటవి కిప్పు డేల విచ్చేసిరో
        వీరిదేహసుశాంతు లారయంగ


తే.

దిక్కులెల్లను వ్యాపించెఁ దెలియఁ జూడ
విప్రుఁ డగుటకు యజ్ఞోపవీతచిహ్న
మమరియున్నది క్షత్రియుం డగుట కెడమ
చేత విల్లున్న దటుగాక చెల్వు చూడ.

137


వ.

విటునికైవడి వేశ్యాంగనామణితోడం గూడి యున్నవాఁ
డనుకొను చుండుసమయంబున.

138


ఆ.

వేడ్క మీఱఁగాను విప్రులు చూడంగ
వచ్చి చక్రి యజ్ఞవాటిలోనఁ
జేరి ద్విజుల నడుం సిరితోడఁ గూర్చుండి
విడెము సేయుచుండె వేడబమున.

139


క.

అప్పుడు వారల నొడలం
దొప్పెడు కస్తూరిగంధ ముర్వీసురులం
గప్పుకొనంగ నొగి న్వా
రప్పద్మదళాక్షుఁ జూచి యని రీరీతిన్.

140


సీ.

ఓమహారాజ నీయూ రేది పేరేమి
        యెవరు నీతలిదండ్రు లిచటి కేల
వచ్చితి విప్పు డీవనమున సవనము
        ల్సేయుచుండెదము నీచిత్తమునను
మామీఁద దయ యుంచి మామఖంబులకు స
        హాయుఁడ వైయుండి యసురవేధ
చోరబాధయు మృగస్తోమంబుచే వేధ
        దప్పించు మావంటిదాపసులకు