పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

39


తే.

వసుమతీశ్వరు లెప్డు కావలియు ననెడు
ధర్మపద్ధతి దప్ప కధ్వరము లిచట
నీవు సేయించు మాచేత నిర్మలాత్మ
యనినఁ జిఱునవ్వు నవ్వి యిట్లనియెఁ జూచి.

141


సీ.

రాజును గాను ధరామరుండను గాను
        కడకు వైశ్యుఁడను శూద్రుఁడను గాను
తల్లితండ్రులు లేరు ధరణీ నాకొక్కని
        వాసంబు లేదు సర్వస్థలముల
సర్వస్వరూపుల చరియించు చుండుదు
        నగుణుండ నామవర్ణాశ్రమములు
లేవని పల్కఁగా నావిప్రు లిట్లని
        రయ్య మీవాక్కుల కర్థ మిపుడు


తే.

మాకుఁ దోఁపదు నీచెంత మచ్చికలర
నిపుడు కూర్చున్న లలితాంగి యెవతె యనిన
మందహసితాస్యుఁడగుచు నమ్మాధవుండు
పల్కె నిట్లని వారితోఁ బ్రౌఢి మెఱయ.

142


ఆ.

నాకు నేన కాని నా కెవ్వరును లేరు
చూడ నొంటివాఁడఁ జూచి నన్ను
వనమునంచుఁ బుట్టి వచ్చె మోహినివలెఁ
బట్టె నిది ప్రియంబు వఱల మునులు.

143


క.

మచ్చికతో నిరువురు కడు
ముచ్చటగాఁ గలసియుండి మును లగుమీ రిం
దచ్చుగ నుండుటఁ గనుఁగొని
వచ్చితి మిటు మిమ్ముఁ జూడ వరమునులారా.

144