పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

399


పాపాత్ముఁడై నేను బ్రాహ్మణస్త్రీవధ
        చేసితి నన్ను రక్షింపవలయు
ననుచుఁ దత్క్రమము దుఃఖాక్రాంతుఁ డై చెప్పఁ
        గా హరి వల్కె భూకాంత వినుము


తే.

మించి వోయిన పని కింక మిడుకుటేల
యెండి పడియుండు దట్టంబు లిచటి కిపుడ
నీవు దెప్పించు మనఁగ నానృపుఁడు భటుల
చేతఁ దెప్పించెఁ దనువుల శ్రీశుకడకు.

320


వ.

అంత శ్రీనివాసుండు తొండవానునితోడ నక్కళేబరంబులఁ
బట్టించుకొని పుష్కరిణికి బూర్వదిగ్భాగంబున నున్న దివ్య
సరోవరంబునకుఁ బోయి తత్తీర్థంబునం దాకళేబరంబులను
ముంచి యెత్తె నప్పు డమ్మువ్వురు సజీవులై లేచి రంత దేవ
తలు పుష్పవృష్టిఁ గురియించి యప్పుణ్యతీర్థంబునకు, నస్థితీర్థం
బని నామం బిడి మఱియు నమృతసరస్సని వొగడి రందుఁ
దొండవానుండు సంతసించి హరిని వినుతించె నంత శ్రీని
వాసుండు, కలియుగంబున మనుజులతో మాటాడిన పక్షం
బున నిక నిట్టి ధర్మసంకటంబులు పొసంగుచుండుఁ గావున
నీనాఁటఁ గోలె మౌనధారియై యుండవలయు నని నిశ్చ
యించె నంతఁ దొండవానుండు సజీవు లగువారిని దెచ్చి
గూర్ముం డనువిప్రున కొసగె నపు డాబ్రాహ్మణుండు
భార్యాపుత్రులం జూచి యెందుఁబోయి యుంటి రని యడుగ
నత్తరుణి యిట్లనియె.

321


సీ.

స్వామి నే నేమని చర్చించి చెప్పుదు
        మహిమాఢ్యుఁ డగువిష్ణుమాయచేతఁ