పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


విని మది భీతినొంది నృపవీరుఁడు చారుల నంపె నత్తఱిన్.

317


ఉ.

చారులు వోయి విప్రుసతి సంతతితో నశియించి యుండుటన్
వారక చూచి వచ్చి నృపవర్యుని కంతయుఁ జెప్పఁగాను దా
నారట మొంది దుఃఖ మపు డాత్మను నుంచి సధైర్యచిత్తుఁడై
యూరక యుండి విప్రుఁ గని యుల్లసముం దగఁ బల్కె నిమ్మెయిన్.

318


సీ.

విను బ్రాహణోత్తమ వేంకటేశుని దర్శ
        నార్థమై మాయింటియాఁడువారు
సనఁగాఁ బతివ్రత యన నొప్పు మీభార్య
        వారితో శ్రీ శ్రీనివాసుఁ జూడఁ
బోయిన దిఁక వచ్చు భోజనకృత్యంబు
        సేయించుచుండుము చిత్తమలర
నని చెప్పి సామగ్రి నంపించి యచ్చటఁ
        బగ లంతయుం బుచ్చి పరిఢవిల్ల


తే.

రాత్రి కాఁగనె బిలము మార్గంబునందుఁ
బోయి శ్రీవేంకటేశుని పుణ్యచరణ
యుగళముల బాష్పధారలు నొల్క నిల్చి
యుండుటం జేసి హరి యనె నుర్విపతికి.

319


సీ.

రాజేంద్ర నీ వింతరాత్రికాలమున నొ
        క్కడ విందు వచ్చిన కార్య మేమి
చెప్పు మేర్పడ నన శ్రీనివాసుని కిట్టు
        లనియె నృపాలకుం డంబుజాక్ష