పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

397


నిరువురకు నన్న మిప్పించి యీస్థలమున
నీవు పాలించుచుండుమో భూవరేణ్య.

312


మ.

అని యావిప్రుఁడు వల్కఁగా నృపుఁడు నీ వారీతి నిందుంచి పొ
మ్మనఁగాఁ గూర్ముఁడు నమ్మి యాత్ర జనె నం దావిప్రుభార్యన్ సుతున్
మనుజేంద్రుం డొకమూలగేహమున నేమం బొప్పఁగా నుంచి తె
ప్పున మాసా లొగి నాఱునం దునిచె సంపూర్ణ ప్రియం బారఁగన్.

313


ఆ.

బహువిశాలమైన భవనంబులో నంత
విప్రుభార్య యుండె విధివశమున
వీధితల్పు చిలుకు వేసి యం దెవ్వఁడో
యుఱికె దాని విప్రునువిద చూచి.

314


ఉ.

వాకిలి తీయుఁ డం చవలినారిని బిల్చిన వారివీనులన్
సోకకయుండె నప్పలుకుఁ జోద్యము నొందుచు విప్రుభార్య నే
నేకరణిం దరింతు హృదయేశ్వరుఁ డిచ్చట నుంచె నంచు దా
శోకము నొందుచున్ దిశలు చూచుచు నచ్చట నుండె నయ్యెడన్.

315


ఆ.

ఆఱునెలలబత్తె మైపోయె నటుమీఁదఁ
గూడు లేక మిగులఁ గుంది కుంది
బెండువడి కృశించి బిడ్డ లిద్దఱు తాను
బ్రాణములును విడిచి పడిరి ధరను.

316


చ.

ఘనుఁ డగు తొండవానుఁ డిటు కర్మవశంబున విప్రుకాంత నం
దొనరఁగ నుంచుట న్మఱచి యుండఁగఁ గాశికిఁ బోయి బ్రాహ్మణుం
డును దను జేరి పుత్త్రి సుతుఁడు న్సతి యేడ నటంచుఁ బల్కఁగా