పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

367


శిరముఁ జల్లికొనుచు సరవి భార్యశిరంబు
నందుఁ జల్లె బంధులందుఁ జల్లె.

211


సీ.

ఆచక్రి కాచమనార్ఘ్యము మధుపర్క
        మిచ్చి పద్మావతి నెలమిఁ బిలచి
జగదీశుఁ డవల నుండఁగ నిర్వురకు మధ్య
        మున యవనికఁ బట్టి మొనసి నృపతి
యను ముదంబున నప్పు డత్రిగోత్రజసువీ
        రకభూమినాథపుత్రికను ధర్మ
రాజాత్మజుఁడ నభోరాజాఖ్యుఁడను నేను
        నాకన్య నిచ్చెద నీకు నిప్పు


తే.

డగ్నిసాక్షిగఁ జేఁబట్టు మంబుజాక్ష
యనఁగ విని చక్రి సంతోష మతిశయింప
సకలసురమునిముఖ్యులు సాక్షిగాఁగ
నావసిష్ఠానుమతి నిట్టు లనియె నపుడు.

212


వ.

వసిష్ఠగోత్రోద్ఛవ శూరసేనాత్మజ వసుదేవపుత్త్రుండనై,
వాసుదేవనామధేయంబు నొంది శ్రీవేంకటేశ్వరుండ నైన
నీయత్రిగోత్రసంజాత యగు పద్మావతిని నగ్నిసాక్షిగఁ బాణి
గ్రహణం బొనర్చెద నని పల్కిన విని నృపాలుండు హరికి వర
దక్షిణ కోటినిష్కంబులు సమర్పించి యవ్వల నమూల్యాభర
ణాంబరంబులును నవరత్నరచితశతభారకిరీటంబును దత్సం
ఖ్యాకభారసువర్ణరత్నరచితబాహుపురులును విమలరత్నాం
చితముత్యాలహారంబును నాగాభరణంబును, దివ్య
మౌక్తికకుండలంబులును ద్వాత్రింశద్భారసువర్ణకటిసూ
త్రంబును, భాగ్యప్రదపద్మరాగగోమేధికస్థగితవీరము