పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ద్రాద్యంగుళీయకంబును, దశభారవజ్రకవచంబును, నష్టా
దళసువర్ణభారపాదుకయుగళంబును శ్రీనివాసునకు
నలంకారంబు సేయించి ఋషులు మంగళాష్టకంబులు చదువం
గుశపుష్పహిరణ్యాక్షతోదకంబులు చేఁబట్టి కనకరత్నా
భరణాంబరభూషిత యగు కన్యకను హరి కరకమలంబుల
దారవోసి యానందపూరితబాష్పలోచనుండై ధర్మార్థకామ
మోక్షసంకల్పంబులయం దీకన్యకారత్నంబును గొని ప్రియం
బున రక్షింతువుగాత, అని సాభిప్రాయపూర్వకంబుగ స్వామిని
ప్రార్థింప నాకర్ణించి హరి మహాప్రసాదం బనుచు నాకాశ
రాజేంద్రుని వచనంబు లంగీకరించె. నంత మాంగల్యకంకణ
ధారణంబులును, అక్షతారోపణంబును, బ్రధానహోమం
బును, సప్తపదాతిక్రమణంబును, లాజహోమంబును, ప్రవేశ
హోమంబును, నరుంధతీపతివ్రతావలోకనంబును, పతివ్ర
తాంగనామణుల సందర్శనంబును, స్థాలీపాకంబును, నౌపాస
నాదులును, వృద్ధదంపత్యాశీర్వచనంబులును, మున్నగునవి
గురువసిష్ఠాత్రిప్రముఖులు నిర్వర్తించి రంత రాజేంద్రుఁడు
పోడశమహాదానంబు లిచ్చి గంధాక్షతపుష్పంబుల సభకుం
బూజచేసి ఫలదక్షిణతాంబూలంబు లొసంగి సంతుష్టులం
జేసె నంత.

213


సీ.

బ్రహ్మరుద్రాదులు పరిఢవిల్లెడు సభఁ
        బేర్మి యౌ నవరత్నపీఠ మునిచి
పటువజ్రకలితదీపస్తంభములమీఁద
        బహుళమాణిక్యదీపములఁ బెట్టి