పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నుంచి పూజలను జేయించిన ఋషులు క
        న్యావరణము చేసి రంత వేడ్క


తే.

సుతను దీవించి మంగళసూత్ర మఱుతఁ
గట్ట నాధరణీదేవి కన్యతోడఁ
గూడ నైదువలను దోడుకొని వివాహ
మంటపము చేర వచ్చి నెమ్మనము నెసఁగ.

208


తే.

తూర్పుముఖముగ సుత నుంచెఁ దోయజాక్షుఁ
డచట పశ్చిమముఖముగ నలరుచుండె
నలఘుమంగళవాద్యము ల్చెలఁగుచుండ
విప్రవర్యులు చూడంగ విధిక్రమమున.

209


క.

గడియలు కావచ్చిన దని
కడువడిఁ బురుహూతముఖ్యగంధర్వాదుల్
కడుకొని చెప్పఁగ నృపుఁ డ
క్కడ హరిసాన్నిధ్యమునకుఁ గ్రక్కునఁ జేరెన్.

210


సీ.

అచ్చట వైవాహికాంగద్రవ్యంబులు
        గని వసిష్ఠుఁడు ముదంబును దగంగ
నపుడు నూతనభర్మయజ్ఞోపవీతముల్
        ధరియించి కంకణధారణంబు
చేయించుకొని యున్న శ్రీహరిపాదప
        ద్మముల బంగరుపళ్లెరమున నుంచి
తపసులు పురుషసూక్తంబులు చెప్పంగ
        పుణ్యతీర్థమును నాభూపవరుని


ఆ.

భార్య దెచ్చి యీయఁ బరమానుముదమునం
గడిగి యమలతీర్థ మెడఁద భక్తి