పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

365


తే.

సకలదిక్పతులును పద్మసంభవుఁడును
గొలువఁగాఁ జక్రి సంతోషకలితుఁ డగుచు
నిర్మలుం డగునాకాశనృపతి నగరు
సేరుటకు వచ్చి మందిరద్వారమునను.

204


తే.

నిలువ మంగళవాద్యాలు నెమ్మిఁ జెలఁగఁ
దొండమానునిభార్య సంతోషముగను
నైదువులతోడఁ జేఁబట్టి హరికి సిరికి
మంగళారతు లిచ్చె శుభాంగముగను.

205


క.

తనకును సిరి కారతు లి
చ్చినవారికి వీడెములను జీనాంబరముల్
ఘనమతి వరనిష్కములను
బెనుపుగ నిప్పించె నాకుబేరునిచేతన్.

206


వ.

అంత శ్రీనివాసుం డైరావతంబు డిగ్గి లక్ష్మిని కరంబు పట్టుకుని
బ్రహరుద్రాదులుతోడ నంతగపురంబులోని కేగి కల్యాణమంట
పంబునం జతురశ్రరత్నవేదికలయందున్న హేమసింహాసనం
బుమీఁద లక్ష్మీసమేతంబుగఁ గూర్చుండగ విధ్యుక్తముగ
నాకాశరాజేంద్రుఁడు నిశ్చితార్థం బొనర్చె నంత.

207


సీ.

అమరఁ బద్మావతి కనసూయ మొదలగు
        నైదువలెల్ల సమ్మోద మెసఁగ
భాసురనూతనాభరణంబులను నవ్య
        చేల చందనపుష్పమాలికలను
గాటుక కుంకుమ క్రమముగ నిపు డలం
        కారంబు చేసి శ్రీగౌరిచెంత