పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

27


కేమి యొసఁగె వినుట కిష్టంబు గల్గె మా
కావిధంబు దెల్పుమయ్య సూత.

95


క.

అన విని సూతుం డిట్లనె
ననఘుండు వరాహదేవుఁ డాగిరిమీఁదన్
ఘనుఁడై నెమ్మి వసించుచుఁ
దన కాంతామణులతోడఁ దగు క్రీడలన్.

96


సీ.

వనపుష్పలతలచేతను బ్రకాశించుచు
        నిరవయి తగుపొదరిండ్లయందు
నీలకాంతులచేత నెఱి నొప్పుచుండెడు
        సదమలసానుదేశంబులందుఁ
బరిమళపుష్పముల్ పై వ్రాలుచుండఁగఁ
        జల్లనై తగుపర్ణశాలలందుఁ
గనకమందిరములకైవడి దీపించు
        రమణీయగిరిగహ్వరములయందు


తే.

మెప్పుగా వ్రాలుపుప్పొడికుప్పలందు
వన్నె కెక్కిన సెలయేటిదిన్నెలందుఁ
గాంతలను గూడి చక్రి యేకాంతముగను
క్రీడసల్పుచు నుండును వేడు కలర.

97


చ.

పరఁగ నధర్మ వాదు లగుపాటిఁ దృణంబుగ నిగ్రహించుచున్
వరుసగ ధర్మచిత్తులను వారకబ్రోవుచు నుండు నెప్పు డా
హరి కివి నైజసద్గుణము లై తనరారును గాన నెప్పుడున్
ధర నవతారముల్తఱుచు దాల్చుచునుండు కృపాసముద్రుఁడై.

98


సీ.

మాటిమాటికిని బ్రహ్మకు రాత్రి యైనప్పు
        డతఁడు నిద్రింపఁగా నఖిలగురుఁడు