పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

321


వేఱ జన్మము గాదు భావింప మీకుఁ
బుత్రియై పుట్టె మీపూర్వపుణ్యమునను.

65


తే.

పెండ్లి యేర్పాట్లు గావింప వేడ్క నన్నుఁ
బంపు మేగెద నాచక్రపాణి మీకు
నల్లుఁ డగుటకు మీభాగ్య మంచు ధరణి
దేవి కలరంగఁ జెప్పి యో దేవి యింక.

66


వ.

నావచ్చినకారణం బంతయు రాజేంద్రునకు సంతసంబాఱ
వచించి నన్నుఁ బ్రయాణంబు గావింపు మనిన.

67


మ.

ధరణీదేవి ముదంబుతో నలిగి చింతం బొందుచున్నట్టి భూ
వరునిం జూచి ప్రియోక్తులార శుభసద్వార్తల్ క్రమం బొప్పఁగా
ధరఁ బుత్రీజననంబు దాని నిజవృత్తాంతంబు నాశేషభూ
ధరవాసుండు వరించినట్టి విధమున్ దార్ఢ్యంబుగాఁ జెప్పఁగన్.

68


సీ.

విని వింత నొంది వచ్చినవకుళాంగన
        జూచి మన్నింప నాసుదతి చూచి
రాజుతో ననియె నో రాజ మీయింటికి
        వచ్చి శ్రీశుభకర వార్తలన్ని
దేవేరి కెఱిఁగించితిని నిజం బిక్కార్య
        మిఁకఁ బెండ్లిలగ్నంబు నెలమిజూడుఁ
డని వల్క నానృపుం డానందమగ్నుఁడై
        హరి యేడ నే నేడ యహ యి దేమి


తే.

వింత యనుచును వకుళతోఁ జింత తలఁగె
నామనంబునఁ బట్టుకున్నట్టితాప