పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మింక సుకృతుండ నైతి భూమీశులందుఁ
గీర్తి వడసితి నాభాగ్యకృతము గాదె.

69


వ.

అని కొంత హరిలీలాచరిత్రంబునకు నచ్చెరువంది వకుళతో
వెండియు నిట్లనియె. నీవు మాకుఁ బరమాప్తురాలై తివి, నీవ
శంబున నాచక్రి మాకు జామాత యగుటం జేసి మేము సుకృ
తాత్ము లైతిమి. నాపుత్రి నాహరి వరించినకథ విన నాహ్లాదం
బగుచున్న యది. అని వకుళమాలికను బ్రియంబునం జూచి
గౌరవించి పద్మావతిచెంత కేగి ముద్దిడి లాలించి యిట్లనియె.

70


క.

విను పద్మావతి నీమన
మున నిఁకఁ జింతింపవలదు ముజ్జగములు పా
లనసేయు సామి కిప్పుడ
నిను నొసఁగుదు వేడ్క వెలయ నిజము కుమారీ.

71


వ.

అని పద్మావతికి నెమ్మది చెప్పి నిజగురుని ధ్యానింప నతండు
వచ్చుటం జూచి యాతని కెదురేగి యుచితార్చనలు గావించి
తోడ్తెచ్చి బంగరుపీఁట నునిచి వకుళమాలిక వేంకటాద్రి నుండి
వచ్చిన యుదంతం బెల్ల నుడువ నగ్గురువర్యుం డానంద మొంది
రాజుం గని యిట్లనియె.

72


సీ.

అరయ నీపురికి నుత్తరభాగమునఁ బంచ
        క్రోశదూరంబున గొప్పగాను
బ్రహ్మానుసంధానపరుఁ డైనశుకయోగి
        యున్నవాఁ డతని మీ రుచితులై స
వారిని బంపి యవ్వరమునిన్ రావించు
        విని రాజు వేడ్కఁ దమ్మునిని బంపి