పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


విష్ణు వని యెంచు రాజదేవీ భవత్హృ
దయమునందున నింక నింతకును మించి.

61


వ.

చెప్ప నాకుఁ దరంబుగాదు గావున నీకన్యకారత్నం బాత
నికిం దగినద పెక్కుయోచనలు సేయకు సత్యంబు వక్కా
ణించితిని.

62


మ.

అని యాభామిని వల్క రాజసతి నెయ్యం బారఁగా శ్రీరమా
వనితారత్నము చెంతనుండఁగను భావం బొప్ప మాకన్యకం
దమ చేఁబట్టు నటంచుఁ బల్కితివి చిత్తంబంచు నెంచంగ నా
కనుమానంబుగ నున్నదంతయు నరుల్ హాస్యంబు గావింపరే.

63


సీ.

అని ధరణీదేవి యనుమానముగఁ బల్క
        వకుళ యిట్లనియె నవ్వార్ధితనయ
కొల్లాపురము సేరి యెల్లభక్తులను ర
        క్షించుచు నున్నది చెలఁగి నచట
కమలలే దాతని కడఁ గాన నీపుత్రి
        నీక్షించి చక్రి మోహించినాఁడు
మీరు మీకన్యను నారాయణున కిచ్చి
        చెలఁగి వివాహంబు సేయుఁ డంచుఁ


తే.

జెప్పి యాసిరి యాపురిం జేరినట్టి
కారణం బంతయును జెప్పి కరము ప్రియము
వేదవతి జన్మవృత్తాంత మాదినుండి
పొసఁగ వినుపించి క్రమ్మఱఁ బొలఁతిఁ జూచి.

64


తే.

వల్క నిమ్మెయి వకుళ మీపట్టియైన
పద్మపద్మాలయాంశసంభవయగాని