పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

319


సీ.

విను ధరణీదేవి వేంకటేశ్వరునకు
        నల నీదుపుత్రిని నడుగ నిట్లు
వచ్చితి మీ రన్యవరుని జూడఁగ మాని
        మాట చెప్పుఁడు నాకు మనసు నెంచి
యన ధరణీదేవి యనె నిట్లు కులగోత్ర
        ములు చెప్పు దల్లిదండ్రులను నుడువు
మని ధరణీదేవి యడుగఁగ వకుళ యి
        ట్లనియెఁ గులంబు శీతాంశుకులము


తే.

వరవసిష్ఠులగోత్రంబు వార కతని
దేవకీదేవి మఱి వసుదేవుఁ డెంచఁ
దల్లిదండ్రు లటంచును దనరఁ జెప్ప
నాపె నాతనిరూపగుణాదు లెల్ల.

59


వ.

వినుపింప మనిన నవ్వకుళమాలిక యిట్లనియె.

60


సీ.

సతి నీవు మాస్వామి సౌందర్య మడిగిన
        మహిత యామన్మథమన్మథుండె
పట్టుగ నతని సౌభాగ్యంబు నడిగినఁ
        జెప్ప శక్యంబె లక్ష్మీవిభుండె
సురుచిరం బైనట్టి సుగుణంబు లడిగిన
        గురుతరకల్యాణగుణగణుండె
చెలఁగి సదాచారశీలంబు లడిగిన
        వేదోక్తసద్ధర్మవిధివశుండె


తే.

సాహసౌదార్యగాంభీర్యసంపదలకు
శాంతసౌహృద్యకరుణారసంబులకును