పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అని చెప్పుటం జేసి ధరణీదేవి దాని కెదురుగఁ బసిండిపీటఁ
గూర్చుండఁ దనచేతిబెత్తం బయ్యింతి కిచ్చి తా నొక
ప్రక్క పట్టుకుని ‘విఘ్నేశ్వరా వీరభద్రా మళయాళభగవతీ
మధురమీనాక్షీ యామ్నాయాక్షీ కామాక్షీ కనకదుర్గాంబ
చౌడాంబ జ్ఞానాంబ కొల్లాపురిలక్ష్మీ మీరెల్లరు వచ్చి
మంచివా కియ్యరే వా కియ్యరే యని ప్రార్థించి యిట్లనియె.

29


క.

దిక్కులు సూడక సతి నా
దిక్కున నీ విపుడు చూడు దేవరతోడే
నిక్కము సెప్పెద నీ కని
మక్కున నాయెఱుకలమ్మ మఱి యిట్లనియెన్.

30


వ.

అవ్వో యవ్వ నీతలచినతలంపు మేలౌతాదంట దేవుళ్లు
పలుకుచుండారు, తలంచినతలం పేమంటివా సెప్పెద విను
దైతమ్మ బిడ్డంటె కడుపుసూపుడు తోడఁబుట్టంటె భుజంబును
సూపుదును నీ విట్లు తోడబుట్టు కడుగలేదు. ఇట్లా బిడ్డ
కడుగుసుండావు. బిడ్డ ఆడుబి డ్డంటావా మగబి డ్డంటావా
చెప్పెద సూడు కొడకా, యాడబి డ్డంటె చెవు సూపుదును
మగబి డ్డంటె గడ్డంబు సూపుడును, ఇదిగో యిట్టి మగబిడ్డ
కడుగలేదు. ఆడబిడ్డ కడుగుసుండావే, అవ్వో యవ్వ
ఆయాఁడబిడ్డకు నొకసింత కలిగుండాది ఆసింత యేమంటావా
నిన్నటిదినము నీబిడ్డ వనాని కేగినాది ఆడ తురగారూఢుండైన
నల్లనయ్యను జూచి మోహించియుండాది యెందుండి
ఆనల్లనయ్య వచ్చినాడంటారా చెప్పెదను దల్లీ ఇదిగో యీ
మూలనుండాఁడు ఆమూల దెలియలేదంటె యీడి
వాయువ్యబాగాన బడిగెలతో మెఱయుసుండు బంగారు