పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


భూలోకవాసుల బ్రోవంగవలయును
        వరము లొసంగి సత్కరుణ మెఱసి


తే.

నాకు నిష్టంబు గలరీతి నీకు నిష్ట
మైన నిల్తును లేకున్న నరయ నిందుఁ
నుండ నని వల్క నిందిర యుల్ల మలర
దరహసితవక్త్రయై యనె హరికి నిట్లు.

84


తే.

మీరు సర్వజ్ఞులరు ప్రియంబార నేను
మీరు నిల్చినయెడ నాకు మేటి మీకుఁ
జింతయేటికి దేవ మీచిత్త మింక
ననిన లచ్చిని యురమునం దలరఁ జేర్చి.

85


చ.

అపుడు వరాహవిగ్రహుఁ డనంతకళాపరిపూర్ణుఁడై మహా
నిపుణత మీఱఁగా సిరిని నీళను దగ్గఱ నాదరించుచున్
విపులపరాక్రమక్రమవివేకవిచక్షుణు లైనపార్షిదుల్
కపటము లేక గొల్వఁగ నఖండసుఖస్థితి నొప్పె నయ్యెడన్.

86


తే.

అనిన తాపసు లిట్లని రయ్య సూత
స్వామిపుష్కరిణీప్రభావంబు మాకుఁ
దెలుపవే యన విని నవ్వి దెలిపె దంచుఁ
బలికె నీరీతి మునిపుంగవులను గాంచి.

87


సీ.

మునులార వైకుంఠమున నుండు క్రీడాన
        గంబుపై స్వామిపుష్కరిణి యుండి
పరఁగ నప్రాకృతపరిమలోదకమై మ
        హాపూర్ణమై యుండు నచట సిరిని
భూనీళలనుగూడి పురుషోత్తముఁడు జల
        క్రీడ లాడుచు నుండు వేడు కలరఁ