పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

25


గ్రీడాచలముతోడ నీడకు దిగి వచ్చి
        విరజాసమానమై ధరణి వెలసి


తే.

హరికి సంతోష మగుచు గంగాదినదుల
కన్నిటకు మాతృదేనత యగుచు జనుల
పాపముల హరియింపుచుఁ దాప మడచి
యిష్టకామ్యార్థములను దా నిచ్చుచుండు.

88


వ.

ఇట్టిస్వామిపుష్కరిణితీర్థదర్శనపానంబులచేతనే స్త్రీశూద్రజనం
బులం బావనులం జేయుఁ గావున విశేషించి స్నానసంధ్యాది
నిత్యనైమిత్తక సకలకర్మకలాపంబు లాచరించు బ్రాహ్మణోత్తముల
పుణ్యం బెంతయని చెప్పనగు నిదియునుంగాక పుష్కరిణీ
స్నానంబును బరమంబగు నేకాదశీవ్రతంబును సద్గురుపాద
సేవనంబును గల్గుట దుర్లభంబు మఱియు సకలస్థావరజంగ
మంబులందు మనుజజన్మంబును బుష్కరిణీస్థలస్నానంబును వేంక
టాద్రియందు జీవించుచుండుటయు నత్యంతయతిశయదాయ
కంబు, గావున వేంకటాచలమాహాత్మ్యంబును బుష్కరిణీ
ప్రభావంబును వచింప నాచతుర్ముఖునికైన నశక్యంబు తత్ప్ర
భావంబులు సంక్షేపంబుగఁ జెప్పితి నింక నొక్కయితిహాసంబు
సెప్పెద నాలకింపుఁడని మునులకు సూతుం డిట్లనియె.

89


సీ.

మును తారకాసురుం డనువాని సేనాని
        యదిమి చంపిన బ్రహ్మహత్యవలనఁ
బీడితుఁడై నిజపితృవాక్య మంగీీక
        రించి గ్రక్కున నిర్గమించి మొనసి
యా వేంకటాద్రికి నభిముఖుఁడై వచ్చు
        నప్పు డాతనిబ్రహ్మహత్య గాంచి