|
బెట్టె నొక్కతె మఱి పూలఁ జుట్టె నొకతె
నెమ్మొగంబును వలువచేఁ జెమ్మఁ దుడిచి.
| 235
|
సీ. |
తిలకంబు నిడె యోర్తు లలిఁ గన్నులకు నోర్తు
గాటుక నీటుగఁ గ్రాలఁ దీర్చె
పరిమళగంధ మాబాలికామణిమేన
నలరంగఁ జల్లఁగ నలఁదె నొకతె
చల్లనిగాడ్పులు మెల్లఁగ నొడలపై
నొలయంగ విసరెఁ బూవులను నొకతె
నెమ్మోము గనుఁగొన నమ్ముద్దియకుఁ బట్టె
నిలువుటద్దము దెచ్చి పొలఁతి యొకతె
|
|
తే. |
రాజనందన కీమాడ్కిఁ బ్రమద మారఁ
జెలులు సేయంగ బ్రాహణస్త్రీలకెల్లఁ
బసుపు కుంకుము విరిసరు ల్ఫలము లలరఁ
గన్యకామణి యొసఁగె సద్ఘనత మ్రొక్కి.
| 236
|
వ. |
అప్పు డవ్విప్రాంగనాశిరోమణు లాపద్మావతిని దీవించి రంతఁ
దెచ్చిన భక్ష్యభోజ్యంబు లచ్చోటఁ గుడిచి చెలులు రచించిన
పూఁబాన్పునఁ గూర్చుండఁ జేసి సుగంధోపేత మగువిడి
యంబు లిప్పించి తాను విడియంబు సేయుచున్న సమయం
బున.
| 237
|
పద్మావతితో నారదుండు సంభాషించుట
క. |
ఆవనమునకుం జయ్యన
దేవమునీంద్రుండు వచ్చెఁ దిలకించి చెలుల్
భావించి యీతఁ డెవఁ డని
యావరముని నడుగ నాతఁ డనెఁ గని యెలమిన్.
| 238
|