పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

263


తే.

వనవిహారము తాఁ జేయవలయునంచుఁ
జెలులతో ముచ్చటాడి మచ్చికలు చేసి
మేడ దిగివచ్చి తల్లిసమీపమందు
జేరి యిట్లని పల్కె నాచిగురుఁబోఁడి.

223


తే.

జనని శృంగారవనము విస్మయముగాను
గనకసౌధంబుమీఁదికి గానుపించెఁ
గానఁ జెలులును నేను నక్కడికి బోయి
తెచ్చెదము నీకుఁ బుష్పము లెచ్చుగాను.

224


చ.

ఆన విని తల్లి యిట్లనియె నమ్మ సుమంబుల కీవు వోయినం
గని జను లెల్ల నవ్వెదరు గాన వనంబున కేను నిన్నుఁ బం
పను జెలికత్తెల న్బనుపు భాసురపుష్పము లింటి కిప్పుడే
ఘనముగఁ దెచ్చియిచ్చెదరు గావునఁ బోకుము బిడ్డ యంచనన్.

225


క.

రంతులు సేయుచు నప్పుడు
గంతు లిడుచు నన్న మెంచకయ పానుపుపైఁ
జింతించుచుఁ బవళింపఁగ
నంతటఁ దనసుతను బిలిచి యాదర మొప్పన్.

226


వ.

అక్కుం జేర్చి మందస్మితసుందరవదనారవింద యగుచు బుజ్జ
గించి యిట్లనియె.

227


సీ.

వనమున కీవు వోవల దన నలిగితి
        నైన మంచిది లెమ్మ యనుచుఁ జెప్పి
చెలులను బ్రాహ్మణస్త్రీలను బిలిపించి
        సుతతోడ వారల జతగఁ జేర్చి
తినుపదార్థంబులఁ గొని చెలికత్తెల
        చే నిచ్చి పల్లకిఁ జేర్చి యపుడు