పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


కమలనీలోత్పలప్రముఖపుప్పోజ్వల
        రమణీయపద్మాకరములదాని


తే.

లలితవిస్తారసిద్ధస్థలములదాని
నమితముక్తికి నాటపట్టైనదాని
సిరిని నీళను భరియించి చెలఁగుదాని
గాంచి యాశ్వేతకటి నవ్వి మించి మదిని.

70


క.

అచ్చెరువుగ నాచెంతకు
వచ్చెను సిరి వచ్చె నీళ వచ్చెను గిరియున్
వచ్చిను బరివారము నా
కిచ్చట సంసార మింక హెచ్చె నటంచున్.

71


వ.

అని తలచుచుండుసమయంబున విహగేంద్రుండు వచ్చె
నంత నావరాహరూపుఁడు చూపిన దివ్యస్థలంబున నా క్రీడా
చలంబును డించి దండప్రణామంబు లాచరించ నాఖగరాజు
నకు సంతసించి యప్పర్వతం బెక్కి యందుంగల పుష్కరి
ణికిఁ బశ్చిమతటంబున నిలిచి యున్నసమయంబున బ్రహ్మ
రుద్రేంద్రామరదిక్పాలకమునులును గంధర్వాదిసిద్ధులును
విచ్చేసి శ్వేతవరాహస్వామిని వీక్షించి సకలనిగమార్థసం
ప్రశ్నల బహుప్రకారంబుల నానందబాష్పాంచితధారా
కలితనేత్రులై సాష్టాంగదండప్రణామంబు లాచరించి
జయజయశబ్దంబులు మిన్నుముట్టంజేసి ముకుళితకరకమల
ములు గలవా రగుచు నిట్లు నుతించిరి.

72


దండకము.

శ్రీమన్మహాశ్వేత సత్క్రోడరూపాయ నిర్లేపబోధ
ప్రదీపా ప్రతాపోజ్వలా శ్రీపభూపా హిరణ్యాక్షకాఠిన్య
దేహాద్రిదంభోళిధారా సురాధార ధాత్రీతలోద్ధార