పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సేయుచు రాక్షసులకు భయప్రదుండై భక్తులకు ముక్తి
ప్రదుండై గొడ్డఁటిగాయంబు మాయంబైపోవ దివ్యసుందర
లీలామానుషవిగ్రహుండై తల్లిచెంత ముద్దులు చూపు
చుండునట్లు వకుళమాలికయొద్ద నటింపుచుండె ననిన మును
లిట్లనిరి.

195


సీ.

వకుళమాలిక యెవ్వ రకళంకచరిత మా
        కెఱిఁగింపు మన సూతుఁ డిట్టులనియె
శ్రీయశోదాదేవి చిన్నికృష్ణునియందుఁ
        బుత్త్రవాత్సల్యంబు పొసఁగనుంచి
కాలగతిని నొందఁగా హేమగర్భుండు
        గని యట్లచేయుట గాదటంచు
వకుళమాలిక యన వనుధను బుట్టించి
        భూవరాహస్వామిపొంత నిలిపె


తే.

నప్పు డాకిటిదేవుఁ డాయతివఁ జూచి
చక్రధరుఁజెంతనుండఁగఁ జెప్పు నాపె
జననివలెఁ గాచుచుండె సుస్వాంత యగుచు
నాయశోద మఱొక్కతె యనఁగఁబడదు.

196


ఉ.

శ్రీరమణీవిభుం డవల శేషగిరీంద్రముమీఁద నిల్చి వి
స్తారముగా వినోదములు సల్పుచునుండి యశోవిహారుఁడై
గారవ మొప్పు నొక్కనృపకన్యను బెండిలియాడె మెచ్చి స
చ్చారిత నెల్లనిర్జరులు సంతసమందఁగ వింటిరే యనన్.

197


సీ.

విని మౌను లాసూతుఁ గనుఁగొని విస్మయం
        బంది యిట్లనిరి యాహరికిఁ దగిన