పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

255


కన్యకామణియందుఁ గల్గె దానికిఁ జూడ
        దలిదండ్రు లన్నను దమ్ము లెవరు
సావధానుండవై యావిధంబంతయు
        విశదీకరించుము వినఁగవలయు
నడుగఁగ సూతుఁ డిట్లనియె నిర్వదియెన్మి
        ది ద్వాపరాంతానఁ దెలియ నవని


తే.

వెలయు కలియుగమం దొప్పు విక్రమార్క
ముఖ్యరాజులు జనియించి ముదము మీఱ
భూమిఁ జక్కఁగఁ బాలించి పోయి స్వర్గ
లోకమునఁ జేరి రిపుడు భూలోకమణులు.

198


వ.

తదనంతరంబు చంద్రకులపాండవదౌహితృవంశంబున సువీరుం
డనురా జుదయించి భూమి నేలుచుండె. నాతనికి సుధర్ముం
డనుపుత్త్రుం డుదయించె. మాధవుండనువానిచరిత్ర మిది
వఱక విని యుండువారలుగదా! యాతఁడ, యాసుధర్మునకు
జ్యేష్ఠపుత్రుఁడై పుట్టి యాకాశరా జనుపేరం బ్రసిద్ధుఁ
డై యుండె. ఆమాధవాఖ్యునిభార్యయగు చంద్రరేఖ పతి
స్మరణంబు సేయుచు దేహంబు చాలించుటం జేసి యామె
యొక రాజింట ధరణీదేవినామంబున జనించియుండ నాధరణీ
దేని యాసుధర్ముండు తనకుమారుం డగునాకాశరాజు కిచ్చి
వివాహం బొనరించిరని వెండియు నిట్లనియె.

199


సీ.

తలఁపఁగ వినుఁ డాసుధర్మాధిపుఁ డొకనాఁ
        డడవిలోపల వేఁట యాడి బడలి
యచ్చట నొకపంకజాకరంబున కేగి
        సుకుమార నాగకన్యకను జూచి