పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

253


చ.

అని హరి వల్కఁగా విని మహామహుఁ డైనవరాహదేవుఁ డి
ట్లనియె నిదేటిమాట లిపు డర్థ మొసంగక భూమి నియ్య న
న్నను గిటిఁ జూచి మాధవుఁడు నవ్వుచు నిట్లనియెన్ ధరాతలం
బొనరఁగ నీయధీన మగుచున్నది కొంచెము నాకొసంగుమా.

193


సీ.

ఎంత నీ విచ్చిన యంతలో నే నుండి
        జీవనోపాయంబు సేయుకొఱకు
నరునిచందంబున నటియించి యిచటికి
        నరుల రావించి నీ కిరవుగాను
పంచామృతస్నాన మంచితంబుగ దిన
        దినము సేయింతు నీతీర్థమందు
మునిఁగి ముందుగ నీకు మ్రొక్కి కాన్కలొసంగుఁ
        డని నియమింతు నాజనులకెల్ల


తే.

నదియుఁ గాక దినం బన్న మరల మొదట
నిచ్చి యావల భుజియింతు నెలమి వినుము
నిజ మిది యనంగ నాకిటి నెయ్యమారఁ
గొలిచి యిచ్చెను నూఱడుగులధరిత్రి.

194


వ.

ఇవ్విధంబున వరాహస్వామి హరి నాదరించి శేషాద్రియందు
నిలిచె నప్పుడ యిద్దఱశీర్షంబుల దేవతలు పుష్పవృష్టి గురి
యించిరి, వరాహదేవుండు తనచెంతఁ బరిచారికయై యుండు
వకుళమాలిక నాహరిచెంత నుంచె, నావకుళమాలిక హరికి
శ్యామాకాన్నంబును దేనెయున్ భోజనంబు సేయించుచు
గొడ్డఁటి గాయంబునకు నౌషధం బిడుచు నుండఁగ, మున్ను
ధేనువత్సరూపంబులు ధరించిన బ్రహ్మరుద్రు లంతర్ధానంబు
నొందిరి, అంత శ్రీనివాసుం డాపర్వతంబున సకలవినోదంబు