పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గనివోవు గనుక యాక్రూరాసురునితోడ
        బహుదినంబుల ఘోరభండనంబు
సేయుచునుంటి నమ్మాయరాక్షసుఁ డెందుఁ
        జిక్కకయుండియుఁ జిక్కెఁ గనుక


తే.

వాని శిక్షించి యిచటికి వచ్చి నిన్ను
నేను జూచితి నన్నును నీవు నిపుడు
గాంచితివి నాకు నీవును మంచినేస్త
కుండ వైతివి సంతస మొందినాఁడ.

190


ఆ.

అని వరాహదేవుఁ డప్పుడు వల్కఁగ
విని ముదంబు నొంది విష్ణుఁ డనియె
నవనిఁ గలియుగాంత మందాక తగినచో
టొండు చూపు నాకు నుండుటకును.

191


సీ.

అని చక్రి వల్కఁగ విని వరాహస్వామి
        యిది యేమి యని సంశయించి పల్కె
హరి విను పేదల నాశ పెట్టఁగరాదు
        చెంత నెప్పుడు బలవంతులకును
దావీయరా దైన ద్రవ్య మిచ్చితి వేని
        కొలచి నూఱడుగులు కుతల మిచట
నీ కిత్తు నని పల్క నాకంజలోచనుం
        డిట లక్ష్మి నాతోడ నెనసియున్న


తే.

ధనము నీ కిత్తు నిపుడు శ్రీతరుణి యలిగి
తాము గొల్లాపురము సేరెఁ గాన ధరణిఁ
గొనుటకై రూక లెవరి నేఁ గొలిచి తెత్తు
ప్రబల యాచించితిని యిందు బ్రదుకవలయు.

192