పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

19


వచ్చి యాక్రోడవిగ్రహువక్షమందు
నిలిచి యుండెద ఖగరాజ తలఁగ కెపుడు.

67


క.

వేఁడు కలర భూదేవికిఁ
గ్రోడాకారంబు జూపి కులికెడుహరికిం
గ్రీడాచల మొప్పినచోఁ
గూడుదలయగాదె యటకుఁ గొనిపొ మ్మింకన్.

68


సీ.

అని పల్కి పరివారమును దాను నిజకళ
        లొనర వైకుంఠమందుంచి యొక్క
కళతోడ గ్రీడానగంబుపై కెక్కి రం
        దఱుతోడ సిరి యానదప్ప కపుడు
గరుడుఁ డాక్రీడాద్రి శిరమున నిడికొని
        ధాత్రికి దిగి వచ్చుతఱిని వివిధ
పుష్పలతాదులు పొల్పుగ నుయ్యెల
        వలె నూఁగ భృంగంబు లొలసి తిరుగ


తే.

కనకగిరిమీఁద నీలాద్రి గ్రాలుచుండు
కరణి హేమాంగుఁ డనఁదగు నురగవైరి
శిరమునం గ్రీడనగమును జెలఁగుచుండ
గగనదిగ్భాగములు దివ్యకళల నెసఁగె.

69


సీ.

చందన జంబీర చంపక వకుళాది
        పాదపంబులతోడఁ బ్రబలుదాని
కనకరత్నాదులకాంతులచే మించి
        కనిపించు నమితశృంగములదాని
కలకంఠశుకనీలకంఠమరాళాది
        విహగకూజితముల వెలయుదాని