పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


విహగనాయకుండు విన్నవించిన నవ్వి
లక్ష్మి యిట్టు లనియె లలిత మెసఁగ.

63


ఆ.

నేను దనకు నెపుడు నిత్యానపాయిని
నగుచు నుండుటెఱిఁగి యద్భుతముగఁ
గ్రొత్తమాట లన్న గ్రోడవిగ్రహమాయ
వింత దోఁచె మదికి విహగనాథ.

64


క.

తా నేరూపము దాల్చిన
నే నారూపము ధరించి నిశ్చలమతినై
పూని యురంబున నుండుదు
నానడవడి క్రొత్త యీదినమున ఖగేంద్రా.

65


క.

తా నిచటికి రాకుండిన
నే నచ్చటికైన వచ్చి నిజముగఁ గిటియై
యానందించుమహాత్ముని
మానితవక్షమున నుందు మహి విహగేంద్రా.

66


సీ.

పాఠీనమై తాను బ్రళయాబ్ధిపై నీదు
        నప్పుడు తనవక్షమందు నుంటిఁ
కూర్మరూపము దాల్చికొని యబ్ధిలో మునిం
        గినయప్డు తనయంద దనరుచుంటి
నంగుష్ఠమాత్రుఁడై యాకుపై శయనించి
        నప్పుడు నేఁ దనయంద నుంటి
చంద్రచంద్రికల కెచ్చట వేఱులేకుండు
        నటుల నేఁ దనయంద నుంటి


తే.

నిప్పు డెదఁ బాసి యుందునె యొప్పుకొంచు
నిచటిపరివారములతోడ నచటి కేను