పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ఉ.

అప్పుడు విష్ణుదేవుఁ డహహా నిలు వావును గొట్టఁబోకుమా
దప్పక పా లొసంగినను దల్లివిధంబుసః గాచె నిత్య మా
విప్పుడు గొల్లచే మడియు టెట్లు సహింపఁగవచ్చు నంచుఁ దాఁ
దెప్పున నైజమస్తకము ధేనువుశీర్షముమీఁద నిల్పఁగన్.

161


సీ.

గొల్లవాఁ డెత్తిన గొడ్డలి హరిమస్త
        కంబులోఁ జొరఁగ రక్తంబు వెడలె
తక్క కప్పుడు సప్తతాళవృక్షప్రమా
        ణంబున నూర్ధ్వముఖంబుగాను
బొంగుచు దిగజారి భూమిపైఁ బడఁజూచి
        గోపకుం డదరుచుఁ గూలి మడిసె
నది చూచి గోవు శేషాద్రిఁ జెచ్చెర డిగ్గి
        తనచోళభూపతిసభకుఁ బోయి


తే.

నేలఁ బొఱలుచు నఱచి కన్నీరు నింప
ధేనువును గాంచి యా రాజు దిగులుపడియె
నప్పు డాపశు వందుండ కొప్పుగాను
పఱచుటం జూచి దానితో బంపెఁ జారు
లను గనుంగొని వచ్చుటకును విభుండు.

162


వ.

అప్పు డాచారు లాగోవువెంట నంటిపోవ నాగోవు వేంక
టాద్రికి వచ్చి వల్మీకంబుడగ్గఱ నిల్చె నంతఁ జారు లాపుట్టలో
నుండి రక్తం బెగురుటయును, గో వందు నిలుచుటయుసు,
గోపఁ డందుఁ బడియుండుటయును జూచి భీతిల్లి యందుండి
రాజుకడకు వచ్చి తద్వృత్తాంతం బంతయు నెఱింగింప నారాజు
విని దిగ్గున లేచి పల్యంకంబునఁ గూర్చుండి పరివారంబుతో
నగ్గిరికి వచ్చి చూచి వెఱఁగుపడి తనమంత్రిం జూచి యీవల్మీకం