పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

243


బునం దిట్టిరక్తంబు ప్రవహించుటకు హేతు వేమనుచు
గోవు కన్నీరు నించుటకును గోపఁడు పడియుండుటకు
యోచించి వితర్కించుచుండు సమయంబున.

163


సీ.

వనజదళాక్షుఁ డావల్మీకమందుండి
        యపు డతిరక్తసిక్తాంగుఁ డగుచుఁ
గన్నీరు వెడల గద్గదకంఠుఁడై శంఖ
        చక్రము ల్చేపట్టి సరగ లేచి
యారాజునుం జూచి యనియె నోపాపాత్మ
        యీపుట్టలోఁ జేరి యెసఁగుచుండ
నేఁడు నీగోపాలుఁ డీడకు వచ్చి కో
        పంబున నా కెప్డు పాలనొసంగు


తే.

నావు నడినెత్తి గొడ్డఁట నవనిఁ బడఁగఁ
జంపెదని మించి పొంచి యాక్షణమ గొట్టఁ
బోయి నాశిరమునఁ గొట్ట భూమిమీఁదఁ
గూలినాఁ డతిపాపంబుఁ గూడినాఁడు.

164


సీ.

విను రాజ ది క్కెక్కడను లేక తల్లిదం
        డ్రులు లేక నాలుబిడ్డలను లేక
బాంధవులును లేక బహుపేదవాఁడనై
        పరదేశినై వచ్చి ఫణినగంబు
పైనుండు పుట్టలోపలఁ జేరి యుండఁగఁ
        దల్లిచందమగు నీధర్మసురభి
క్షీరంబు లిచ్చి రక్షించుచుండంగ నీ
        పశుపాలుఁ డేడ్తెఱఁ బశువుఁ జంప