పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సేయుచు దిగ్దేవతాదులను దలంచి, “ఈ బ్రాహ్మణుండు పాప
జాతినైన నన్నుఁ బొంది కులహీనుండై నరకంబునం బడుటకు
బ్రయత్నించి సముద్ర ముప్పొంగివచ్చునట్లు నాపైఁ బడ
వచ్చుచున్నవాఁడు, నావలన నించుకేని దోషంబు లేదు మీ
రెల్లరు నాకు సాక్ష్యమిచ్చువా రగుదురుగాక” యనుచుండ
నాభూసురుం డాయువతికడకుం జని యిట్లనియె.

74


తే.

భామ నీ విప్డు చెప్పిన పరమధర్మ
వచనముల నే నెఱుంగుదు వసుధఁ గామ
మునను నావలె నెందఱో మున్ను ధర్మ
మును దలంపక స్త్రీలను గొనిరదేల?

75


తే.

తరుణి నానోము ఫలియించెఁ బరఁగ నీదు
జవ్వనపుఁగారణంబునఁ జాలు వేయి
జన్మములు సేయఁ గల్గునే సౌఖ్య ముర్విఁ
గాన నాయిష్ట మీడేర్చు కరుణహృదయ.

76


వ.

అనిన నయ్యింతి భయభ్రాంతచిత్తయై యవ్విప్రుని కిట్లనియె.

77


చ.

కటకట! బ్రాహ్మణోత్తముఁడ కామసుఖంబును గోరి లేనిసం
కటపడ నేల నీగృహము గ్రక్కునఁ జేరి నిజాంగనామణిం
బటుముద మొప్పఁ గూడు ననుఁ బట్టిన నేమి ఫలంబు గాన న
న్నిట చని పట్టరాకు మిది యేమి యపభ్రమ నీకు మానుమా.

78


క.

చండాలస్త్రీ నెనయుట
పండితుఁడా వినుము నీకుఁ బాపము రాదే
మెండొడ్డి విప్రకులమున
టుండుము న న్నంటరాకు ముర్వీసురుఁడా.

79