పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

219


క.

అని యది వెనుకకుఁ జనఁగాఁ
గని విప్రుఁడు కులము మించి కామాంధత్వం
బును గదుర వడిగఁ జని దా
నిని బట్టంబోవ నదియు నిలువక చనుచున్.

80


వ.

అప్పు డాకుంతల యతనిం జూచి, "బ్రాహ్మణోత్తమా! నీజననీ
జనకులుతోడె, గురుదైవంబులతోడె, న న్నంటకు” మను
చుండఁగ వాఁడు వినక యాయువతిం బట్టికొనియె. నంత నది
చూచి నీవు న న్నంటినకతన నంటువడితివి. సచేలస్నానం బొనర్చి
యింటి కరుగు. మూరక దురాశచేత మేటికొలం బేల వమ్ము
చేసుకొనెద వనుచుండ నవ్విప్రుం డది పాటించక యాయబల
పైఁబడి కట్టుకుని యిష్టంబు పరిపూర్తి గావించుకొనియె. ననం
తరం బాకుంతల యాభూసురునిం గని, “కటకటా! నే నబల
యగుటం జేసి నీపట్టుకు నెం దేని దవ్వు నరుగలేనైతి ననజలద
జలప్రవాహంబు క్షారోదధిం బడిననిధంబు నీవు నాసంగమం
బునఁ గులభ్రష్టుండవైతివి. నీ వింక యజ్ఞోపవీతపరిత్యాగంబు
చేసి మదీయచండాలజాత్యాహారాదులు చేసి, నాకుఁ బరిణ
యంబు లేనికతన నిఁకవేఱ నాకు వివాహంబు పని లేదు గావున
నాతోడ నుండు”మనిన నావిఫ్రుం డందులకు నంగీకరించె.
అంత నయ్యిద్దఱు గృష్ణానదీతీరంబునం జేరి ద్వాదశహాయ
నంబులు కామోపభోగంబు లనుభవించుచుండఁ గొంతకాలం .
బునకు నక్కుంతల మృతినొందుటం జేసి మాధవాభిఖ్యబ్రాహ్మ
ణుండు దుఃఖాక్రాంతచిత్తుఁడై యొంటిందిరుగుచుఁ దనమనం .
బున నిట్లు చింతించె.

81