పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శా.

సర్వజ్ఞుం డగు మద్గురుం గొలిచి యశ్రాంతంబు సద్భక్తిచే
నిర్వాణప్రదుఁ డౌవినాయకుని వాణి న్వేడి తొల్లింటి స
ద్గీర్వాణాంధ్రకవీంద్రులం దలచి యక్షీణాత్మబోధోల్లస
త్పూర్వాచార్యులపాదపద్మయుగముల్ పూజింతు నిష్టాప్తికిన్.

5


క.

పంకజహితశశినేత్ర క
లంకరహిత మోక్షదక్ష లక్ష్మీరమణా
శంకరవిధిసన్నుతపద
పంకజ తఱకుండనృహరి పాపవిదారీ.

6


సీ.

అని యిష్టదేవతాప్రార్థనం బొనరించి
        వేడ్కఁగొల్పెడు ఘనవేంకటాద్రి
మాహాత్మ్యమునను వరాహపురాణంబు
        ముప్పదియధ్యాయములను దొలుత
మొనసి మూఁడాశ్వాసములు చేసి యావరా
        హస్వామి కర్పించి యవల నెడఁద
రహిని భవిష్యోత్తరపురాణమున శ్రీని
        వాసువిలాసము ల్వసుధయందుఁ


తే.

బ్రజకుఁ దెలియంగఁ దేటగఁ బద్యరీతి
ధృతి రచింతును దఱికుండ నృహరికృపను
దప్పులుండినఁ దగ దిద్ది యొప్పుగాను
చదువ నెంచెద బుధులార సదయులార.

7


వ.

ఆకథాక్రమం బెట్లన్న వినుండు.

8


ఉ.

శ్రీకరనైమిశాటవిని శిష్టమును ల్పరమాద్భుతంబుగం
బ్రాకటభక్తిమై నొగి వరాహపురాణము విన్నమీఁద సు