పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

187


తే.

శంఖచక్రధరుండు సజ్జలజపత్ర
లోచనుండు పరాత్ముండు లోకకర్త
యైన నారాయణుండు దయాంతరంగుఁ
డగుచు నమ్మునులను జూచి యనియె నిట్లు.

182


చ.

మునివరులార! మీ రిటకు మోదముతో నను జూడవచ్చి నం
దునఁ గడుభక్తిపూర్ణులని తోఁచిన దిప్డు వరంబు లేమి యి
త్తును దగఁ దెల్పుఁ డర్థిమెయి దూరము వచ్చితి రంచు బల్కఁగా
విని మునిపుంగవు ల్గనుచు వేంకటనాథుని వేఁడు చొప్పుచున్.

183


సీ.

పలికి రిట్లని పరబ్రహ్మస్వరూప వా
        ఙ్మానసాతీతుఁడ వైననీవు
వైకుంఠముననుండి వచ్చి వేంకటగిరి
        యందున్న నిన్ను మే మనిశ మాత్మ
లను జూచుచుందుము తనత నాదివ్యమం
        గళవిగ్రహం బిప్డు గంటి మిందు
నలరు చర్మాక్షుల నంతియఁ జాలు మా
        కొక్కవరం బేల నిక్కముగను


తే.

గరుణమై మోక్షమార్గంబు గాంచి యిమ్ము
వేయివరములు మాకేల వేంకటేశ
యనఁగ నా శ్రీనివాసుఁ డమ్మునులఁ జూచి
దహసితాననుఁడై వల్కె దయ యెసంగ.

184


మ.

మునులారా! పరిపూర్ణకాములు మహాముఖ్యు ల్జగత్పావనుల్
తనర న్మీరు వరంబు లొల్లమని నిత్యానందముం బొందినం
దున సంతోషము నొందితిం బరమశాంతు ల్మీకుఁ గామ్యార్థముల్