పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దాదింద్రియాంతఃకరణప్రసన్నతయు, శాంతియు, క్షుత్తు
గలిగి, సర్వతోష మొనరించి వివిధభయంబులఁ బోఁగొట్టు. నిది
వస్తికర్మం బగు. నిఁక నీతికర్మం బెట్లన్న జానెడుపొడువు
సూత్రము మలినము లేని నేతియందుఁ దడిపి నాసికమునం
బీల్చి నోట వెడలదీయఁగఁ దివ్యదృష్టి గల్గు. నిఁకఁ ద్రాటక
కర్మంబు వచించెదఁ, గదలనిచూపువలన, సూక్ష్మంబైనగుడిని
యేకాగ్రచిత్తంబునఁ గన్నీరొల్కఁ జూడఁగ నేత్రరోగా
దులువోయి బంగరుపెట్టియవలె గోప్యము సేయందగినది.
ఇఁక నహుళికర్మంబును వక్కాణింతు వినుము, తీవ్రంబునం
గడుపును గుడియెడమగఁ ద్రిప్పఁగఁ గడుపులోని మందాగ్ని
విడచి దీపనంబు గల్గి పాచనాదులు గల్గుచు నానందమలరి
సమస్తనాగదోషంబులను బోఁగొట్టును. హఠయోగంబునకు
శ్రేష్ఠమైయుండు నిన్నహుళీకర్మం బిఁకఁ గపాలభాతికర్మం
బెట్టిదంటివేని వినుము. లోహకారకుఁడు కొలిమితిత్తి నూది
నట్లు రేచకపూరకంబులు చేయం గఫాదిరోగంబులు తలం
గును. దేహదార్థ్యము నాయురారోగ్యము గల్గుచుండు.
కాఁబట్టి యీషట్కర్మంబులు క్రమంబుగ నభ్యసించి రోగ
విరహితులైన నాడులు వశవృత్తులగుచుండునప్పుడు సిద్ధాస
నాసీనుఁడై, రేచకపూరకకుంభకాన్వితంబైన ప్రాణాయామ
పూర్వకంబుగ షణ్ముఖిముద్రాభ్యాసంబు సేయుచుండు. నావల
సుషుమ్ననాడికిం గారణంబైన మూలాధారాధికబ్రహ్మరం
ధ్రంబు గలదు. ఆరంధ్రంబును దత్వమనియుఁ ద్రిబింగళ
నాడులు ముఖంబనియుఁ జెప్పుదురు. తత్కారణంబున నమృ
తంబు స్రవించునట్లు స్రవించుటవలన మానవశరీరములకు