పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

వైష్ణవధర్మము

ఉ.

ఖ్యాతిగ శ్రీనివాసుఁడతిగౌరవ మొప్పఁగ వేంకటాద్రిపై
భూతలవాసులం గృపను బ్రోచినసత్కథ వింటి మిందుచే
మాతపము ల్ఫలించినవి మంచిది వైష్ణవధర్మ మెట్టిదో
సూత తదీయధర్మములఁ జొప్పడఁ జెప్పుమొకింత యింపుగన్.

66


మ.

అనినన్ సూతుఁడు సంతసించి మునివర్యాళిన్విలోకించి యి
ట్లనియెన్ ధాత్రిని శుభ్రఘోణిఘసదంష్ట్రాగ్రంబుతో నెత్తితె
చ్చినమీఁదన్ ధరణీసమేతుఁ డగుచున్ శేషాద్రియం దుండఁగా
నొనరం దత్కిటి చూచి భూమి యపు డత్యుత్సాహ ముప్పొంగఁగన్.

67


తే.

ఇట్టు లనియెను గిటిరూప యీశ్వరేశ
నిర్మలము లైనవైష్ణవధర్మములను
జెప్పుమని వేఁడ భూమి నీక్షించి యజ్ఞ
పోత్రి యిట్లని పల్కె సంపూర్ణదయను.

68


సీ.

వైష్ణనధర్మము ల్వరుసగ నన్నియుఁ
        జెప్పవే యిపుడు సంక్షేపముగను
దయ ననఁగాఁ జెప్పెదను సంతసంబుగ
        వైష్ణవాచారము ల్వసుధయందు
విశ్వాసహృదయులై వినినవారికిఁ బర
        గతులు సిద్ధించు నిక్కంబుగాను
గురుఁడె ధర్మంబు సద్గురువే పరమగతి
        గురుఁ డాత్మ యని నమ్మికొనినవారి


తే.

భూరిదురితము నశియించిపోవు గనుక
యేవిధంబున గురుమర్మ మెఱిఁగి భక్తి