పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

141


సలుపఁగాఁ దగువారు వైష్ణవులటంచుఁ
జెప్పఁ దగియుండు లోకప్రసిద్ధిగాను.

69


తే.

ఎన్నిపాపము లొనరించి యున్నఁగాని
సద్గురుని జేరి శరణన్న సమయమునన
భూరిదురితము నశియించిపోవు గురుని
శిష్యుడై పాప మావలఁ జేయరాదు.

70


వ.

అదెట్లనిన గురుకటాక్షంబు లేనియప్పుడు తెలియక చేసిన
పాపపుంజంబును గురువరేణ్యుడు సమయంప నేర్చు. నాచా
ర్యానుగ్రహంబు గల్గిన వెనుక తెలిసి చేసిన పాపంబు గురుండు
శమింపలేఁడు గావునఁ దత్పాపంబు గురుని బొందునని తెలిసి
బుద్ధిమంతు లైనవారు పాపభీతి గలవారై యుండవలయు,
నవ్విష్ణుండ గురుండని నిర్ణయించుకొనవలయు, మనుజమాత్రుం
డని గురుని నెంచిరేని యుత్తమగతి సిద్ధింపనేరదు, సంసార
సముద్రంబునం బడి మునింగిపోవుచున్న సమయంబున నుత్తమ
శాస్త్రధర్మం బను హస్తంబునఁ బట్టి వారి లేవనెత్తి మోక్ష
తీరంబున నిలిపి యుపకారం బొనర్చినగురువర్యునకుఁ దాను
బాపంబు సేయకుండుటయుఁ బ్రత్యుపకారం బగుచుండు.
నాచార్యులెట్టివా రనినఁ జెప్పెద విను మని వరాహస్వామి
భూదేవి నీక్షించి యిట్లనియె.

71


సీ.

న్యాయమార్గమునంద నడువడి గలవార
        లెలమి ధర్మ మధర్మ మెఱుఁగువారు
పుణ్యసత్కర్మతపోనిష్ఠు లగువార
        లతిశాంతహృదయు లైనట్టివారు