పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

5


నరయంగ వరలబ్ధ మన్నమాచార్యున
        కాంధ్రభాషాకవిత్వాఢ్యు లగుచుఁ
దనరునన్నయను దిక్కనసోమయాజికిఁ
        బోతరాజునకును నీతులయిన
కవులకుఁ బండితాగ్రణులకుఁ బౌరాణి
        కులకు భక్తిని మ్రొక్కికొనుచు నేను


తే.

వేంకటాచలమహాత్మ్యవిభవములను
బద్యరీతిని రచియించి భక్తి మెఱయ
శ్రీనివాసునిపాదరాజీవములకు
బొసఁగ నర్పింతు మోక్షంబుఁ బొందుకొఱకు.

18


సీ.

పండితాగ్రణులార ప్రజలార యిపుడు నా
        బాలభాష కసూయపడక వినుఁడు
తల్లిదండ్రులు చిన్నపిల్లలపల్కుల
        కానంద మొందెడునట్ల యిందు
మీరు నాతప్పొప్పు లేరీతిగానైన
        గేలిసేయక చిత్తగింపవలయు
నాంధ్రగీర్వాణమహాకృతు లుండఁగా
        నిప్పు డీకృతి విననేల యనక


తే.

భక్ష్యములు మెక్కి యావలఁ బచ్చడియును
నంజుకొనినవిధంబున నాప్రబంధ
మాలకింతురటంచు బేరాసచేత
నేను రచియింతు దీని మన్నించి గనుఁడు.

19


శా.

నారీతిం దగ విన్నవింతును గృపన్నాతండ్రులారా వినుం
డారాజీవదళాక్షుసత్కరుణ నాయందుండు నైనన్మదిన్