పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

103


తే.

జేయు టుచితంబనఁగ సురజ్యేష్ఠుఁ డంత
సకలదేశాధిపతులను సంతసముగ
నుత్సవముఁ జూడ రావించి యుత్కటమగు
వేడుకలు మించఁ జేయించువేళ నటకు.

107


వ.

ద్రవిడ కర్ణాట కురు కుకుర కేరళ కేకయ కోసల మగధ
మాళవ శూరసేన చోశ నేపాళ మళయాళ బంగాళ పాం
డ్య పాంచాల కొంకణ టెంకణ విదర్భ సౌరాష్ట్ర శక సౌవీర
యుగంధ రాంధ్ర విదేహ మత్స్య పుళింద చేది త్రిగర్త
సింధు సింహల లాట కాంభోజ కాశ్మీర మహారాష్ట్ర దేశా
ధీశ్వరులు పరిజనంబులతోడను, బంధుమిత్రకళత్రపుత్రసహి
తహితంబుగ గోవిందేతినామంబులు స్మరించుచు నవ్వేంకటాచ
లారోహణంబుచేసి శ్రీపుష్కరిణియందు సభక్తిస్వాంతు లై
స్నానం బొనర్చి శుచివస్త్రధారు లై, శ్రీవరాహస్వామి
నీక్షించి పరమానంద మొదవ వినుతించి నమస్కరించి కాన్క
లర్పించి శ్రీనివాసుని మందిరంబున కేతెంచి యనేకవిధంబులం
బొగడుచు దండప్రణామంబు లాచరించి వివిధవస్త్రభూషణ
ఫలపుష్పతాంబూలము లర్పించి ధన్యులమైతి మని సంత
సించునెడ నజుండు విష్వక్సేనుం బిలిచి యిట్లనియె.

108


క.

విను సేనాధిప మజ్జన
కునకు మహోత్సవము లిచటఁ గొనియాడఁగ నె
మ్మనమున సమకూర్పఁగ వే
జను మందల మెక్కి యనఁగ సంతసమారన్.

109


సీ.

అపుడు సేనాపతి హరి కజునకు మ్రొక్కి
        యందలం బెక్కి సానందుఁ డగుచుఁ