పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

శ్రీరంగమాహాత్మ్యము

శా. అయ్యా నాచెలి చిత్రసేనుఁ డనువాఁ డాకాశమార్గంబునన్
      నీయాస్థానికి వచ్చుతో తెరవులో నిష్కారణం బేలనో
      చేయిం గాలు గదల్పలేకిటలు మూర్ఛిల్లం దదీయార్తికై
      నెయ్యుండౌట హితార్థినై చనితి వానిం దేవదేవాళితోన్.
ఉ. పోయిన నెవ్వరో ధరణి భూతగణంబులు కయ్యమిచ్చినన్
      మాయమరాళి నొక్కఁడును మార్పడఁజూలక నెన్కతీసిరే
      నాయెడఁ జేతివజ్రము రయంబున బంపిన నెవ్వఁడో యొకం
      డాయతశక్తిఁ బట్టుకొనినం తటిదీరె మదీయశౌర్యముల్.
గీ. అనిన నమ్మాటలో కుముదానుచరుఁడు, ధాతకును గేలుమొగిచి యే ధరణినుంచి
      వచ్చినాఁడను స్వామి వజ్రహేతి, మీవశంబున నొసఁగి రమ్మీయటంచు.
క. కుముదుని వేగులవాఁడని, కమలాసన వచ్చె నింద్రుకైదువు భాండా
      రమునం బగిలము సేయిం, పుము సెలవా నాకు మరలి పుడమిం బోవన్.
క. అని చారుఁ డేగుటయును నిం, ద్రునిఁ గనుఁగొని పొమ్ము నీశ్వరునిపుణ్యము చే
      సినకతన మగుడవచ్చెం, కననిది సింగంబు నాతికండ తెఱంగై.
శా. శృంగారోపవనాదిశోభనము లక్ష్మీనిత్యవాసంబు శ్రీ
      రంగబ్రహ్మము సహ్యజాంతరమహారమ్యప్రదేశంబునన్
      రంగద్వైభవ మొప్ప నుండునటె యారాజ్యంబుపై నల్గి యా
      భంగి న్వచ్చుట క్రమ్మరం బొడముటల్ భాగ్యాతిరేకంబునన్.
గీ. వెఱ్ఱివాఁడవుగాక వివేకివైన, రంగధామంబు నీవు చేరంగఁజనునె
      చాలు మనవంటివార మాస్వామియాజ్ఞ, మీరువారల నొకని నిమిత్తముగను.
క. నీశస్త్రము నాయస్త్రము, పాశుపతం బపరదివ్యబాణంబులు రం
      గేశుని సేవకులందుఁ బ్ర, వేశించునె నాకమునకు విచ్చేయుఁ డనన్.
మ. కడకున్ సిగ్గున నోసరిల్లి హితులం గంధర్వుల బిల్చి తా
      నడిగింపం జెవిచెంతకుం జని త్రిలోకాధీశు రంగస్థలిం
బడియున్నాఁడటె చిత్రసేనుఁ డతనిన్ బాలించి రక్షింపుమీ
      యెడకుం జేర్పునుపాయ మెట్టిదయొ మీ రీక్షింపు డుల్లంబునన్.
క. రంగవిమానచ్ఛాయా, సంగతినిన్ వ్రాలె తదనుచర శిక్షితుఁడై
      సంగతి నేగుచు నేము దొ, రంగి చనినకతన ప్రాణలాభము కలిగెన్.
క. ఇందునకై గిరికన్యా, మందిరుఁడు వహించుకొని ప్రమాదము నొందెన్
      ముందెఱుఁగక తా బోయి పు, రందరుఁడును కత్తియిబ్బి రాఁగా వలసెన్.