పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

53

క. లోకైకకంటకుండు త్రి, లోకభయకరుఁ డధర్మలోలుఁడు బహుదో
      షాకలితుఁడు రావణున కీ, వేకరణిం దోడబుట్టితివి పుణ్యుఁడవై.
గీ. అకట నాభియు నిర్విషం బొకటఁ బుట్టి, నటుల హాలాహలమమృత మబ్ధిఁ బుట్టి
      నటుల పౌలస్త్యు లైతిరి ట్లన్నదమ్ము, లిట్టివారౌట గాన మేపుట్టువులను.
క. శ్రీరాముఁడు కనికని నీ, కేరీతిని రంగధాము నిచ్చెఁ గలతెరం
      గెరుపఱచి మరిపొమ్మని, నారలు కౌఁగిటను గ్రుచ్చి వలగొని భక్తిన్.
గీ. రంగధామంబు ఇచ్చి నీయంగ మెట్ల, పావనతఁ గాంచె నేమును పావనులము
      నిన్ను నాలింగనముఁ జేసి నీకు నెట్లు, పరుసవేదిని సరియంచుఁ బలుకవచ్చు.
సీ. నావుఁడు నోమౌనినాయకులార మిమ్మందఱ రాము పట్టాభిషేక
      వేళ జూచినవాఁడ విన్నారెకాదె తత్పూర్వరామాయణ పుణ్యచరిత
      తరువాత కథ నయోధ్యాపట్టణంబులో నడచిన తెరఁగు విన్నపము చేతు
      భానుసూనుఁడు వసిష్ఠానుమతంబు పట్టంబు రఘుపతి గట్టబనిచె
      ననశనవ్రతసంకల్పు నపగతాత్ము
      నింద్రు నజు రక్షణోన్మేష జాగ
      రూకున సుఖోపతుల్యుగాత్రుని సుమిత్ర
      తనయు లక్ష్మణుఁ జూచి సీతావరుండు.
క. మము నెల్లఁ బ్రేరకులుగా, సమకట్టి బ్రియోక్తు లాడి సముచితయువరా
      జ్యమునకు పట్టముఁ గట్టన్, సుమహాప్రార్థనలు సేయ సుస్థిరమతియై.
క. తా నొల్లనని సుమిత్రా, సూనునికడ కోరసిల్ల శుభమతి భరతుం
      బూనించిరి మౌనులు రా, మానుమతిం దదనుసారి యగురాజ్యంబున్.
ఉ. వాలితనూజభానుజుల వారిప్రధానుల నున్నవారలన్
      మేలగు కట్టువర్గము లమేయవిభూషణగంధమానతాం
      బూలము లిచ్చి పంచినను బూర్ణమయం బగుదృష్టిఁ జూచి మీ
      ప్రోలున కేగుమన్న నగఁబొంది తనుం బెడబాయజాలమిన్.
ఉ. ఇచ్చితి నాదుసొమ్ము లివి యిందఱికిన్ మును బ్రహ్మపాలిటన్
      వచ్చిన భాగ్యరాశి పరవస్తువు దెచ్చి మనుప్రభుండు తా
      మెచ్చఁగఁజేసె నిప్పురికి మిత్రకులీనుఁడు మామనీనువీ
      లచ్చలలీలఁ గల్మి నగలాసల పెన్నిధి దాచి రందఱున్.
క. నా కిది కులవనమై తగు, నా కిది ప్రాణాధికంబు నా కిది సకల
      శ్రీకారణ మే నిచ్చితి, నీకుం గొనిచనుము పురికి నెమ్మది ననుచున్.