ద్వితీయాశ్వాసము
29
క. తానును సమయార్హాను, ష్ఠానంబులు దీర్చి పురికిఁ జనువాఁడై నా
పూనిక దెలియక రంగవి, మానము తలవంచి మ్రొక్కి మది బొఁదలఁగన్.
గీ. మ్రొక్కి యెత్తెననని చేర మున్నెయదియు, శేషజిహ్వికలన ఫణిశ్రేణి దూర
నారసాతలముగ వ్రేళ్లువారి మేరు, పర్వతోపమై ధాత్రినిఁ బారుకొనియె.
క. చులకన నెత్తఁగఁ జూచెం, బలిమిం గదలించిచూచెపై పళ్లుగఱచి యౌ
తలనానియెత్తి చూచెన్, నలుగురుమంత్రులును గొని పెనంగియుఁ జూచెన్.
క. దానవపతి యీకరణి వి, మానము తాజుట్టుముట్టి మల్లాడి దిగుల్
పూని యిదియేమి రంగశ, యా నా యిఁక నేమి చేయునయ్యా యనుచున్.
సీ. కనలేక నీయందునునిచిన కావేరియమ్మ రంగస్వామి నంపవమ్మ
దీనునిపై పనీదేవకామినులార కరుణింపరమ్మ రంగవిభుఁ గూర్చి
యాకాశవాణి నీవైన రంగేశ్వరుహృదయ మిట్లని యానతియ్యవమ్మ
ధారుణీపతి రంగధాముఁ డేటికిరాడు కలయర్థ మీవైన బలుకవమ్మ
తండ్రి శ్రీరామ నీవు నీదాసునన్ను, యలమటలు దీర్చి రంగేశు ననుపవయ్య
స్వామి శ్రీరంగశయన నీచరణయుగళి, నమ్మి వచ్చితి రావయ్య నన్నుఁ గాన.
ఉ. హాయను నీవొసంగిన మహాధన మంకెకు రాదు రమ్ము రా
మాయను నోసమీరణకునూరక సజ్జదెమల్పఁ దోడుగా
వేయను తెచ్చి యూరక కవేరీజలో నిను డించి పోదు రం
గాయను నిక్కమో కలయొ కాయను నేరము నచ్చెఁగా యనున్.
క. ఈ తెఱఁగు చారజనముల, చేతన్విని నిచుళరాజశేఖరులకు నతి
ప్రీతుండై ధర్మవర్మపు, నీతుఁడు దా వచ్చెనని వినీతుండగుచున్.
సీ. కలిగెఁగా కృతతపఃఫలసారసామగ్రి చేకూరె సంకల్పసిద్ధి నాకు
పొందెగా దేవతా జాఫలుంబెల్ల నబ్బె ననంతపుణ్యాతిశయము
దొరికెగా బహుదానపరిలబ్ధభాగ్యంబు పరగశరీరసాఫల్యమహిమ
జతగూడెగా సమార్జితసుకృతవ్యక్తి నిండు కోరికలెల్ల పండెనిపుడు
నే గృతార్థుండ నన్నింట నేటిదినమె, దినము నాజన్మ మేజన్మ మనిన నిట్టి
రంగధామంబు లోకైకమంగళంబు, వెలసె కావేరి ననుమాట విన్నకతన.
మ. అని నానాహితబాంధవద్విజన్మపాలామాత్యవర్గంబు చెం
తనుగొల్వన్ దనుజేంద్రుఁ జేరఁజని నీదాసుండ శ్రీరంగధా
మునికిన్ దాసుఁడ వీవు నీపదయుగంబున్ బూజఁ గావింపఁగ
ల్గెను జాలింపు విచార మేల తనువీలీలన్ శ్రమం బొందఁగన్.