పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

శ్రీరంగమాహాత్మ్యము

సీ. అని యూరడించి మహానుభావ విమాన మజహరేంద్రాదులకైన బలిమి
      నెత్తరా దిదిమొద లుత్తరాఫల్గునినాటిపర్యంతంబు నలినభవుని
      నియమంబును రోహిణీనామకామృతసిద్ధయోగంబున జేసినావు
      రంగప్రతిష్ఠ తీరదు చేర నంతటవేగిరించిన నది విస్తరింతు
      చల్లకై వచ్చి ముంత దాచంగనేల, యెదురుజూచుచునుండితి మిన్నినాళ్లు
      నీకతన నాదుకోర్కెలన్నియు ఫలించె, ననఘము తదీయపూర్వాగమంబుకరణి.
గీ. దశరథుఁడు పుత్రకామేష్ఠి తానొనర్పఁ, బూని పిలిపించె రాజులఁ బుడమియెల్ల
      నేలువాఁడౌట బోయిన నేను నట్టి, యుత్సవమునకుఁ బోరామి యున్న కతన.
క. నరపతి జన్నము దోడ్తో, నరివిరియలకించె నియతి ననబృధస్నానం
      బిరువుగఁ జేసియు భూనా, థుల బహుమానముగ వేడ్కతో ననుపుతరిన్.
చ. ఉడుగరలేను నంది నతఁ డూరికి పొమ్మనిపంప నూరకే
      వెడలక వారి గుప్తమగువిత్తము నేర్పున మోసపుచ్చి యె
      ప్పుడు గొనిపోదు దీని కొకబుద్ధియుఁ దోఁచదు డించిపోవఁగా
      నడుగులురావు రంగనిలయా నిను నెన్నఁడుఁ జూడఁగల్గునో.
మ. అని దాయాదివిరోధ మేరుపడ నే నాలోచనల్ జేసి రం
      గనివాసుల్ గొనితేర నప్పటికి మార్గం బేమియున్ లేక న
      చ్చినత్రోవ న్మరలంగవచ్చి మదిలో చింతింపుచు న్నాపురం
      బున కాలూద నసహ్యమై యువతీసంభోగాదులున్ మానితిన్.
మ. అశనాదుల్ భుజియింపఁగా నరుచి భూషాదుల్ గనన్ వేపటల్
      స్వశరీరాదిశరీరరక్షణవిధానసంసక్తిపై నొల్లమున్
      పశులందున్ మొగమీఁక యుండుటయు చాలంగల్గి యేప్రొద్దు రం
      గశయాను న్మదినిల్పి మౌని నియతిన్ గావేరితీరంబునన్.
మ. లవలీ లుంగ లవంగ వకులైలా నాగ పున్నాగ చూ
      తవితానమ్ముల మంజులప్రసవగంధప్రాపకుంజాంతర
      స్రవదుద్వేలమరందపూరితసరిత్సాహవ్యభాగంబులన్
      భువనాధీశ్వరుఁగూర్చి చేసితి తపంబు న్మాసపర్యంతమున్.
క. ఈజాడనుండఁగా న, వ్యాజోపకృతిస్వభావు లచ్చట భార
      ద్వాజాదిమునులు ననుఁగని, రాజ తపం బీవుసేయు క్రమ మెద్ది యనన్
చ. తెలిపిన వారలందుకు మతి న్సహియింపక ధాత్రి యేలుటో
      చలమున శత్రుభూవరుల సంగరవీథిని గెల్చుటో జనా