పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9


క.

అల చినచెవ్వనృపాలున
కలఘుగుణాలంబ మూర్తిమాంబకు సుతుఁ డై
విలసిల్లె నచ్యుతక్ష్మా
తలనాథుం డచ్యుతుండె తప్ప దనంగన్.

36


క.

కరపద్మశంఖచక్రము
లరు దగు గరుడధ్వజంబు నతులితపీతాం
బరముఖచిన్హము లుండఁగ
ధర నచ్యుతుఁ డనెడు పేరు దగు నాతనికిన్.

37


సీ.

మన్ననారునకును మహనీయగోపుర
        ముఖము లౌ కైంకర్యముల నొనర్చె
రామసేతువునఁ దీర్థము లెల్లఁ బ్రకటించి
        యిల మహాదానంబు లెల్లఁ జేసె
రంగధామున కంతరంగ ముప్పొంగఁగా
        రత్నాంగియుఁ గిరీటరాజ మొసఁగె
శ్రీముష్ణముఖ్యవిశేషస్థలంబుల
        సకలవైభవముల సాఁగఁ జేసె


తే. గీ.

[1]నౌర నాలుగు దిక్కులయందు శౌరి
కతఁడు జేయని కైంకర్య మరయఁ గలదె!
పాండ్యతుండీరముఖ్యభూపతుల గెల్చె
సొరిది నాఘనుఁ డసహాయశూరుఁ డగుచు.

40


క.

ఆయచ్యుతభూవరునకు
నాయతసత్కీర్తి మూర్తిమాంబకు విమతా
జేయుఁడు రఘునాథమహీ
నాయకుఁ డుదయించె సజ్జనస్తుతమతియై.

39


వ.

అమ్మహామహుండు.

40


సీ.

అల రామదేవరాయల విరోధము మానఁ
        జేసి సింహాసనాసీనుఁ జేసెఁ
బంపులఁ దద్వైరిబలముల సాధించి
        నేపాళభూపాలు నిలిపె మగుడ

  1. అవుర